భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ :- వైభవ్ మెరుపులు.. జింబాబ్వే పై తొలి టి20 లో భారత్ విజయం
హరారే : వరుసగా రెండో రోజు టీ20 ప్రపంచ కప్ గెలిచాక ఆడిన రెండు సిరీస్ లోను వైట్ వాష్ కు గురైన టీమిండియా ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది జింబాబ్వేతో మూడు టీ20 ల సిరీస్ లో (ZIM vs IND) భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది భారత టి20 సారథిగా ఏడు మ్యాచ్ ల తర్వాత శ్రేయస్ అయ్యార్ తొలి విజయం అందుకున్నాడు
టాస్ పొడి తొలత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్నిత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని టీం ఇండియా 13.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్య వంశీ (50. 19 పంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సులు ) చెలరేగాడు. ఇషాన్ కిషన్(35. 24 బంతుల్లో 3 కోర్లు 2 సిక్స్ లు ) శ్రేయస్ అయ్యర్ (28*: 24 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేశారు మాయాంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు రెండో టి20 శనివారం జరగనుంది
తొలుత జింబాబ్వే టాప్ -4 బ్యాటర్లు బ్రయాన్ బ్రెనేట్ (0) బ్రెన్ కర్రను (10) డి యోన్ మయర్స్(6) సికిందర్ రాజా(4) త్వరగానే పెవిలియన్ చేరారు. దీంతో ఆ జట్టు 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది తర్వాత వచ్చిన వెస్లీ మద్విరా (39) మరుమాని (27*). రేన్ బర్ల్ (26) జట్టును ఆదుకున్నారు. మారు మాని. మద్విరా ఆరో వికెట్ కు 37 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు భారత బౌలర్లలో మాయాంక్ యాదవ్ 2. ప్రిన్స్ యాదవ్ 2. శివం దుబే. రవి బిస్నోయి ఒక్కో వికెట్ పడగొట్టారు

