Saturday, September 19, 2026
Homeఆంధ్ర ప్రదేశ్నాగులరపు వరప్రసాద్ అరెస్టు అయ్యారు.

నాగులరపు వరప్రసాద్ అరెస్టు అయ్యారు.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, హమారా ప్రసాద్ అలియాస్ నాగులరపు వరప్రసాద్ అరెస్టు అయ్యారు. ‘కల్పిత నాయకుడు–ది ఫ్యాబ్రికేటెడ్ లీడర్’ పుస్తకంపై దళిత, అంబేద్కర్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి నిరసనలు చేపట్టాయి. పుస్తకంలోని అంశాలు అంబేద్కర్‌ను కించపరిచేలా ఉన్నాయని వారు ఆరోపించారు. 

అంబేద్కర్‌పై వివాదాస్పద పుస్తకం.. ఆవారా ప్రసాద్ అరెస్ట్

హైదరాబాద్, సెప్టెంబర్ 18: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు, అభ్యంతరకర అంశాలతో పుస్తకాన్ని రూపొందించారనే ఆరోపణల నేపథ్యంలో రచయిత హమారా ప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రచించిన ‘కల్పిత నాయకుడు–ది ఫ్యాబ్రికేటెడ్ లీడర్–వాల్యూం 1’ పుస్తక ఆవిష్కరణను అడ్డుకోవాలని దళిత, అంబేద్కర్ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 

పుస్తకంలోని శీర్షిక, కవర్, ప్రచార అంశాలు, అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తూ హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పుస్తక ఆవిష్కరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 

ఈ వివాదం తెలంగాణ హైకోర్టుకు కూడా చేరింది. పుస్తక ఆవిష్కరణను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది హమారా ప్రసాద్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు, పుస్తక ప్రతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఆన్‌లైన్‌లో పుస్తక ప్రచారం, డిజిటల్ కాపీలపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. 

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి రచయితను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కోరే ప్రక్రియ చేపట్టారు. పుస్తక ప్రతుల స్వాధీనం, ఆన్‌లైన్‌లో దాని ప్రసారం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. 

ఇదిలా ఉండగా, హుజురాబాద్‌లో కూడా అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న భారీ నిరసన జరిగింది. అంబేద్కర్‌ను కించపరిచే వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి, పుస్తక ఆవిష్కరణను నిలిపివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. 

అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసుల చర్యలతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పుస్తక ప్రచురణ, డిజిటల్ ప్రసారం, నమోదైన కేసు తదుపరి దర్యాప్తు అంశాలపై అధికారిక చర్యలు కొనసాగుతున్నాయి. 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.