నిండు సభలో భీమ్ ఇండియా టుడే ప్రతినిధి శ్రీకాంత్ కు ఘన సన్మానం
భీమ్ ఇండియా టుడే న్యూస్ భువనగిరి:లో ఏపూరి సోమన్న 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని భువనగిరిలో నిర్వహించిన సభలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ఆవిష్కరించారు. సోమన్న కళా, సామాజిక ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు, జర్నలిస్టులు, కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏపూరి సోమన్న సమక్షంలో నిండు సభలో భీమ్ ఇండియా టుడే ప్రతినిధి శ్రీకాంత్ను మీసాల గణేష్, సురేష్లు ప్రత్యేకంగా ఘనంగా సన్మానించారు. శ్రీకాంత్కు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.


