భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ఈరోజు హుజురాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో “గ్రామ సభ” నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అన్నాడి మాధవి-రవీందర్ రెడ్డి మరియు గ్రామ ఉప సర్పంచ్ కాశీరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్శి బుర్ర విజయ్ కుమార్ ఉపాధి హామీ ఫిల్డ్ ఆఫిసర్ బానాల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ బిల్ కలెక్టరు కొండా అశోక్,కారోబార్ పొద్దూటూరి మధుకర్ రెడ్డి గ్రామ యూత్ నాయకులు మిడిదొడ్డి రాజు,SHG మహిళా సంఘాల నాయకురాల్లు మరియు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు కార్యదర్శి మాట్లాడుతూ ‘గ్రామ అభివృద్ధి ‘లో భాగంగా గ్రామంలోని కొత్తగా అప్లై చేసుకున్న చేయూత పెన్సన్స్ వారు ఒక క్రోత్త ఫాం తో వితంతు , ఒంటరి మహిళ, వికలాంగుల, గీత కార్మికుల , చేనేత పింఛను కావలసిన వారు తేదీ 18-8-2026 వరకు గ్రామ పంచాయతీ లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది..”గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక గురించి,GPDP గురించి, బాలల సమస్యల గురించి మహిళల సమస్యల గురించి,రోడ్ల గురించి చర్చించడమైనది వీటితోపాటు ఇతర సమస్యల గురించి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది

