కంకిపాడు మండలం, ఈడుపుగల్లు, పునాదిపాడు, గోసాల, కంకిపాడు గ్రామాలలో జరిగిన నారా లోకేష్ బాబు పర్యటన విజయవంతం.
నారా లోకేష్ బాబు గారు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారితో పాటుగా కార్యక్రమాల్లో పాల్గొన్న తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ పెనమలూరు నియోజకవర్గం పర్యటనకు విచ్చేసిన విద్య మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు ఈడుపుగల్లు వద్ద స్వాగతం పలికి తదుపరి కార్యకర్తలు, నాయకులు నిర్వహించిన లోకేష్ బాబు గారి రోడ్ షో ర్యాలీలో పాల్గొన్న అనంతరం పునాదిపాడు కళాశాల ప్రారంభోత్సవంలో, సీనియర్ కార్యకర్త బిల్లా సత్యనారాయణ గారి పరామర్శ కార్యక్రమం, డోర్ టు డోర్ కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం మొదలగు కార్యక్రమాలలో నారా లోకేష్ బాబు గారు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, వాసంశెట్టి సుభాష్ , ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి గార్లతో పాటుగా కార్యక్రమములో. “తదుపరి గోసాల గ్రామంలో జరిగిన డోర్ టు డోర్ ప్రోగ్రాంలో భాగంగా కార్యకర్త సత్యనారాయణ గారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి, తదుపరి గోసాల గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా శ్రీ నారా లోకేష్ బాబు గారు, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గారు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు రెండు సంవత్సరాల కూటమి సుపరిపాలనపై వివరించి కార్యకర్త కుటుంబానికి అన్ని రకాలుగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామ అభివృద్ధిలో అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగినది
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నారా లోకేష్ గారి పర్యటనను జయప్రదం చేయడం జరిగింది..

