Friday, August 28, 2026
HomeEditorialశాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయీ

శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయీ

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  ప్రజాప్రతినిధులకు వివరించారు. 

 బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి  అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.

 ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ అనుమతులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

 ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి  తుమ్మల నాగేశ్వర్ రావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క  ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్ , రామచంద్ర నాయక్ గారు, బీర్ల ఐలయ్య వేముల వీరేశం  పాల్గొన్నారు.ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి , కడియం కావ్య  రఘువీర్ రెడ్డి  ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య  హాజరయ్యారు.

అలాగే ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం , వీర్లపల్లి శంకర్  ప్రేమ్ సాగర్ రావు , నవీన్ యాదవ్ , మట్టా రాగమాయి  మందుల సామేల్ , వేడ్మ బొజ్జు  కోరం కనకయ్య  లక్ష్మీకాంతరావు , రాందాస్ నాయక్ , కడియం శ్రీహరి  డాక్టర్ సంజయ్ బత్తుల లక్ష్మారెడ్డి , మనోహర్ రెడ్డి  తెల్లం వెంకట్ రావు, నాగరాజు రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళి నాయక్  యశస్విని రెడ్డి  పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.