భూ దోపిడీ వ్యవహారాలన్నింటినీ ప్రత్యేక విచారణ టీమ్ కు రిఫర్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ధరణిని అడ్డం పెట్టుకుని భూములను అక్రమంగా కొల్లగొట్టిన వ్యవహారాలపై ప్రత్యేక విచారణ బృందాన్ని SET ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. నిషేధిత జాబితా 22ఏపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. భూములకు సంబంధించి ప్రధానంగా నాలుగు రకాల సమస్యలు కాలక్రమేణా తలెత్తాయని సవివరంగా సభ ముందు ఆవిష్కరించారు. జరిగిన భూ దోపిడీ వ్యవహారాలన్నింటినీ ప్రత్యేక విచారణ టీమ్ కు రిఫర్ చేస్తున్నట్టు తెలిపారు. నిజాం...