BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 4:22 pm Posted by : Reporter Srikanth

హనుమాన్ టెంపుల్ అభివృద్ధికి సహకరిస్తున్న వోడితెల ప్రణవ్ బాబుకు అభినందనలు తెలియజేసిన

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ మండలం లో ఆలయ కమిటీ సభ్యులు బీసీ జేఏసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజరాబాద్ పట్టణంలోని హనుమాన్ టెంపుల్ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నాయకులు ఒడితల ప్రణవ్ బాబు తాను ఇచ్చిన మాట ప్రకారము ఆలయ ఆవరణములో కళ్యాణ మండపం నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం పట్ల ఆలయ కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్ వైస్ చైర్మన్ బల్లు పున్నం చందర్ పాలకవర్గ సభ్యులతో పాటు బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ సందేల వెంకన్న ఇప్పకాయల సాగర్ మామునూరు ప్రవీణ్ కుమార్ ఆకుల సదానందం ఆలేటి రవీందర్ కొలిపాక క్రాంతి కుమార్ హర్షాన్ని వ్యక్తం చేసి నారు అదేవిధంగా ఇటీవల ప్రణవ్ బాబు తన పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ టెంపుల్ ను సందర్శించి శిథిలావస్థలోనున్న ఆలయ పునర్నిర్మాణం కొరకు 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించుటకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం పట్ల సంతోషాన్ని వెలిబుచ్చినారు ఆలయము పై భాగము పెచ్చులు ఊడిపోయి భక్తుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నందున ప్రణవ్ బాబు చొరవ తీసుకొని తగిన నిధుల మంజూరికి కృషిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హనుమాన్ టెంపుల్ పునర్నిర్మాణానికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేసినారు