దళితులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైలెట్ ప్రాజెక్టును చేపట్టి దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని దళిత బంధు పథకాన్ని ఏర్పాటు చేసి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసి దళితులను అభివృద్ధిలో పతాక స్థాయిలో నిలిపి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఘనత నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం అధినేత కేసీఆర్ గారికి చెందుతుంది అని అన్నారు
నేడు అసెంబ్లీ దళిత స్పీకర్ ను అవమానపరుస్తున్నారని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ నేతలు
దమ్ముంటే రాష్ట్ర మొత్తం దళిత బంధు పథకాన్ని ఇచ్చి
గత మా ప్రభుత్వము మొదటి విడతగా ఇచ్చిన దళిత బంధు కాకుండా హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం రెండో విడత దళిత బందు పథకాన్ని అమలు చేసి దళితులను ఆదుకునే ప్రభుత్వమని నిరూపించుకోండి దళితులకు మీరు చేసింది ఏమీ లేదని ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పొన్నాల శివాజీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితుల గూర్చి మాట్లాడే అధికారం లేదని దళితుల పట్ల మీకు అభిమానం ఉంటే తెలంగాణ రాష్ట్ర మొత్తం దళిత బంధు పథకాన్ని అమలు చేసి వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నేతలకు ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన తెలిపారు.