BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 9:25 am Posted by : Reporter Srikanth

రాష్ట్ర అధికార పదవి బాధ్యతలు అప్పగించిన చంద్రశేఖర్ ఆజాద్ రావన్

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) అధ్యక్షునిగా నాపై నమ్మకం ఉంచి రాష్ట్రస్థాయి పదవిని అందించిన భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు నగీన ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారికి మరియు జాతీయ అధ్యక్షులు వినయ్ రతన్ సింగ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని నా ప్రతి అడుగు ప్రజా సేవకే అంకితం చేస్తానని ఈ పదవిని అధికారానికి ప్రతీకగా కాకుండా ప్రజాసేవకు లభించిన పవిత్రమైన అవకాశం గా భావిస్తున్నానని ప్రజల అభ్యున్నతి కోసం నిస్వార్ధంగా కృషి చేయడమే నా ప్రధాన లక్ష్యం అని మహనీయులు వేసిన బాటలో ప్రతి ఒక్క పౌరుణ్ణి నా బాధ్యతగా బలోపేతం చేయడమే నా ప్రథమ కర్తవ్యం గా భావిస్తున్నాను. రాష్ట్ర అధికార పదవి బాధ్యతలు అప్పగించిన చంద్రశేఖర్ ఆజాద్ రావన్ గారికి మరియు వినయ్ రతన్ సింగ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్ జై భారత్ జై సమిధాన్