Date of Publish : 01 September 2026, 9:19 pmPosted by : Reporter Srikanth
బదిలీపై వెళ్తున్న సీఐ పులి రమేష్కు ఘన వీడ్కోలు
సేవలను గుర్తు చేసుకుంటూ అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తల భావోద్వేగం
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన సీఐ పులి రమేష్ బదిలీపై వెళ్తుండటంతో మండల కేంద్రంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సీఐ పులి రమేష్ తన విధుల నిర్వహణలో ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారని నాయకులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటూ, ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేసిన తీరు అభినందనీయమన్నారు.
ఎల్కతుర్తి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడంలో సీఐ రమేష్ అందించిన సేవలను ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.
“మంచి పోలీస్ అధికారిగా, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగిన వ్యక్తిగా సీఐ పులి రమేష్ గారు మా మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన బదిలీ మాకు బాధ కలిగిస్తోంది. భవిష్యత్తులో కూడా ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం” అని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.
ఎల్కతుర్తిలో ఆయన అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని, ఇలాంటి ప్రజా సంబంధాలు కలిగిన పోలీస్ అధికారులు ఎల్కతుర్తి ప్రాంతంలో విధులు నిర్వహించాలని నాయకులు ఆకాంక్షించారు.
బదిలీపై వెళ్తున్న సీఐ పులి రమేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్ సేవా ప్రయాణం విజయవంతంగా సాగాలని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కోరుకున్నారు