Date of Publish : 29 August 2026, 9:14 pmPosted by : Reporter Srikanth
ప్రజారాజ్యం పార్టీ స్థాపించి నేటికి 18 ఏళ్లు!
18 ఏళ్ల క్రితం మొదలైన ఓ మహా సంకల్పం…
ప్రజారాజ్యం పార్టీ స్థాపించి నేటికి 18 ఏళ్లు!
చిరంజీవి గారు నాకు కేవలం ఓ అభిమానం కాదు… ఆయనే నా జీవితం, నా స్ఫూర్తి, నా రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగు.ఎన్నో ఆశలు… ఎన్నో కలలు…సేవే లక్ష్యం… ప్రేమే మార్గం” అనే మహోన్నత సంకల్పంతో మెగాస్టార్, పద్మ విభూషణ్ చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది.చిరంజీవి అభిమానిగా మొదలైన నా ప్రయాణం…ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ నాయకుడిగా నా తొలి అడుగుగా మారింది.
ఆ రోజుల్లో చిరంజీవి గారి ఆశయాలు, ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత నాలో రాజకీయ చైతన్యాన్ని నింపాయి.
ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనకు బలమైన పునాది వేశాయి.ప్రజారాజ్యం పార్టీలో వేసిన ఆ తొలి అడుగు…నేటికీ నా జీవిత ప్రయాణంలో చెరగని జ్ఞాపకం.అభిమానిగా మొదలైన బంధం…స్ఫూర్తిగా మారిన అనుబంధం…ప్రజాసేవ వైపు నడిపించిన మహా ప్రస్థానం…అది చిరంజీవి అది ప్రజారాజ్యం…అది నా రాజకీయ జీవితానికి తొలి అధ్యాయం. చిరంజీవి గారు నా అభిమాన హీరో మాత్రమే కాదు…నా జీవితానికి స్ఫూర్తి, నా రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శి.