BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 4:07 pm Posted by : Reporter Srikanth

సాంస్కృతిక రంగంలో స్వాభిమానానికి పెద్దపీట వేశారని కొనియాడారు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చైతన్యానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, పత్రికా సంపాదకుడు, సాహితీవేత్త డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.

 తెలంగాణ నేల సంస్కృతి, భాష, సాహిత్య వైభవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కలాన్ని ఆయుధంగా మలుచుకుని సామాజిక చైతన్యాన్ని రగిలించిన రామానుజరావు పత్రికా రంగంలో విలువలకు, సాహిత్యంలో ప్రమాణాలకు, సాంస్కృతిక రంగంలో స్వాభిమానానికి పెద్దపీట వేశారని కొనియాడారు.

 తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, భాషా-సాంస్కృతిక ప్రత్యేకతల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.