BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 9:48 pm Posted by : Reporter Srikanth

ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించడానికి అవకాశం ఉన్నందున జ్ఞాన సముపార్జన

స్వేరోస్ ఆధ్వర్యంలో ఈ నెల 30న గంగా ధరలో జరుగు జ్ఞాన సమ్మేళనాన్ని విజయవంతం చేయండ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ఈనెల 30వ తేదీన గంగాధరలో స్వేరోస్ అధినాయకత్వము ఆధ్వర్యంలో నిర్వహించు జ్ఞాన సమ్మేళనం పురస్కరించుకొని హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద స్వేరోస్ నాయకురాలు ఆకినపల్లి శిరీష ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ బుద్ధుడు పూలే అంబేడ్కర్ల ఆశయ సాధన లక్ష్యంగా ముందడుగు వేస్తున్న స్పేరో అక్షరం ఆరోగ్యం ఆర్థికం ఈ మూడింటిని సాధించడానికి స్వేరో చేస్తున్నటువంటి కృషిని అభినందించి నారు బహుజన బడుగు బలహీన వర్గాల బిడ్డలు అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని తగినటువంటి జ్ఞానాన్ని ఆర్జించి ఆర్థికంగా బలపడినప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించడానికి అవకాశం ఉన్నందున జ్ఞాన సముపార్జన కొరకై ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ మూడు లక్ష్యాలను అధిగమించడానికి స్వేరోస్ అధినాయకత్వం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన గంగాధర మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జ్ఞాన సమ్మేళనానికి బహుజన బడుగు బలహీన వర్గాల ప్రజలతోపాటు మేధావులు అత్యధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజరాబాద్ మహిళా ప్రధాన కార్యదర్శి దేవసాని ప్రియదర్శిని గొర్రె చిరంజీవి మేకల రవీందర్ గడప రాజు రామ్ రాజేశ్వర్ బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్ కొలిపాక సమ్మయ్య ఉపాధ్యక్షులు మామునూరు ప్రవీణ్ కుమార్ కొలిపాక క్రాంతి కుమార్ జూపాక నరసింహాచారి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు