BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 11:05 pm Posted by : Reporter Srikanth

జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరపున హుజురాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం (JSS)  తరపున హుజురాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని పూర్తి మద్దతు హుజురాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలు వెంటనే ఇవ్వాలని న్యాయపోరాటం ప్రతినిధి సంధ్యల వెంకన్న భీమ్ ఇండియా టుడే పత్రిక తూముల శ్రీకాంత్ టుడే  తెలంగాణ స్టేట్ ఇన్చార్జి దేవసాని ప్రియదర్శిని ఎస్ సృజన

జర్నలిస్టుల నాయకుల డిమాండ్  కేసీ క్యాంపులో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తమకే ఇవ్వాలని హుజురాబాద్ జర్నలిస్టు ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాయిత రాములు కామినేని రవీందర్ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేసి తదనంతరం స్థానిక తహసిల్దార్ కు మెమొరం ఇవ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టు సంక్షేమ సంఘం హుజురాబాద్ అధ్యక్షులు సందేల వెంకన్న ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్ మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హాయంలో ప్రభుత్వానికి నాలుగో కాలైన ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టు మిత్రులేనని తెలియజేస్తూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ జర్నలిస్టులకు కేసి క్యాంపు కార్యాలయంలోని ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామి రెడ్డి దీనికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అభిప్రాయపడినారు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని అతని చేత సంబంధిత కేసు ఉపసంహరింపజేసి జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను వారికే క్రమబద్ధీకరణ చేయాలని ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులపై అక్రమంగా చేసిన కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇట్టి భూముల క్రమబద్ధీకరణకు జర్నలిస్టుల నిర్వహించే ఉద్యమ కార్యక్రమానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి జర్నలిస్టులకు కేటాయించిన భూములను క్రమబద్ధీకరణ చేసి తగు న్యాయం చేయాలని లేనియెడల మా యొక్క నిరసనను తదితర రూపాలలో మాకు కేటాయించిన ప్లాట్లు మాకు చెందే వరకు మా యొక్క శాంతి యుత పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.