BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 4:48 pm Posted by : Reporter Srikanth

మాట ఇచ్చి మడమతిప్పని నేతగా హుజురాబాద్ నియోజకవర్గం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి పేదవారిని అభివృద్ధి పదంలో కి తీసుకురావాలని దృఢ సంకల్పంతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రియతమా నాయకుడు *మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు* గారు ప్రవేశపెట్టిన పథకాలను తూచా తప్పకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన ఆ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులను ఎంపిక చేసి ఇప్పుడు స్థానిక హుజురాబాద్ నియోజవర్గ *ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భారతీయ రాష్ట్ర సమితి గారి* ఆధ్వర్యంలో తేదీ10 ఆగస్టు 2026 ఆదివారం రోజున కమలాపూర్ మండల గ్రామాలలోని ప్రజలకు

 మాట ఇచ్చి మడమతిప్పని నేతగా హుజురాబాద్ నియోజకవర్గం లో పంపిణీచేసి తన సత్తాను చాటుకున్నారు… ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

ఈ సందర్భంగా హుజురాబాద్ మండల *ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ BRS పార్టీ నాయకులు* మాట్లాడుతూ పేదరికంలో ఉన్న ప్రజలకు డబల్ బెడ్ రూములను ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మరియు అదే విధంగా హుజురాబాద్ గణేష్ నగర్ లో ఉన్న డబల్ బెడ్ రూమ్ లను కూడా వెంటనే అర్హులైన పేదలకు ప్రజలకు ఇవ్వాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హుజురాబాద్ మండలంలోని 20 గ్రామాల ఉప సర్పంచ్ ల తరఫున. ప్రభుత్వాన్ని   డిమాండ్ చేయడం జరిగింది.