కాంగ్రెస్ ఎస్సీ సెల్ సభను విజయవంతం చేయాలి: బత్తుల పరుశురాం
భీమ్ ఇండియా టుడే న్యూస్ అదిలాబాద్ ఎస్సీ సెల్ చైర్మన్ కవంపల్లి సత్యనారాయణ సభకు హాజరుకానున్నారు ప్రజాపాలనలను ప్రజలకు అభివృద్ధి కలిగే అంశాలపై ముందుకు తీసుకెళ్లే విధంగా ఆదిలాబాద్: ఈ నెల 10న ఆదిలాబాద్ టీపీసీసీ భవన్లో నిర్వహించనున్న కాంగ్రెస్ ఎస్సీ సెల్ సభను విజయవంతం చేయాలని ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బత్తుల పరుశురాం, సభ పరిశీలకుడు బత్తుల పరుశురాం పిలుపునిచ్చారు.
సభ ఏర్పాట్లు, జన సమీకరణపై ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పరమేశ్వర్, వైస్ చైర్మన్ దుర్గం శేఖర్తో వారు చర్చించారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్లో యువతను ప్రోత్సహించడంతో పాటు యువకులకు తగిన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్ సభకు పెద్ద ఎత్తున ప్రజలు, యువత తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు కోరారు.