Date of Publish : 05 August 2026, 7:03 pmPosted by : Reporter Srikanth
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, తెలంగాణ చేనేత ఐక్యవేదిక
భీమ్ ఇండియా టుడే న్యూస్.కరీంనగర్జాతీయ దినోత్సవం సందర్భంగా, తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో తెలంగాణ చేనేత చైతన్య మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తే లంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ శ్రీ దూడం వెంకట్ రమణ గారు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్, ఆహ్వాన కమిటీ చైర్మన్ ఎలిగేటి శ్రీనివాస్, ఆహ్వానం మేరకు హుజురాబాద్ మండలం పద్మ శాలి సంఘం నాయకులు చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు బండారి సదానందం, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రామచంద్రము, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు ఎలిగేటి ఉపేందర్, ముశం వెంకట్ నారాయణ
మరియు రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్, చేనేత ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు జడల అశోక్, బింగి రాణి, సంగెం శ్రీనివాస్,తో పాటు అధిక సంఖ్యలో పద్మశాలి సంఘం సభ్యులు మహిళా సంఘం సభ్యులు, నేత కార్మికులు, ఈ సమావేశంలో పాల్గొని అభినందనలు తెలిపారు