BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 12:10 am Posted by : Reporter Srikanth

రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్

 Food Poison | గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 25 మంది విద్యార్థులు అస్వస్థత రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి.

భీమ్ ఇండియా టుడే: వర్ధన్నపేట్ రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా వరంగల్‌ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల కలుషిత ఆహారం తినడంతో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

కాగా, చికిత్స పొందుతున్న విద్యార్థులను తహసీల్దార్‌ విజయసాగర్, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిటిడిఓ నారాయణరెడ్డి, హాస్పిటల్స్ సూపరిండెంట్ వీరిన్ పిల్లలకు అందుతున్న వైద్యులు వైద్య చికిత్సను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు