Date of Publish : 04 August 2026, 10:25 pmPosted by : Reporter Srikanth
డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించడానికి వ్యతిరేకిస్తూ
బీన్ ఇండియా టుడే ప్రతినిధి హుజురాబాద్ RS ప్రవీణ్ కుమార్ గారి భద్రత – ప్రభుత్వ* *బాధ్యత..* మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి అకినపల్లి శిరీష* ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబెడ్కర్ చౌరస్తా లో నిరసన…
బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు *చందుపట్ల జనార్ధన్* అధ్యక్షులు *సంధ్యల వెంకన్న* మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఐపీఎస్ ఆఫీసర్గా సేవలు అందించి, గురుకులాల కార్యదర్శిగా ఎంతోమంది పేద బిడ్డల భవిష్యత్తులో వెలుగులు నింపి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పని చేస్తూ ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించడానికి వ్యతిరేకిస్తూ ఈరోజు హుజురాబాద్ లో బీసీ సంఘాలు ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్వేరో రాష్ట్ర కార్యదర్శి గడిప రాజు, జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్, జేఏసీ మహిళా రాష్ట్ర జనరల్ సెక్రటరీ దేవసాని ప్రియదర్శిని, ఎస్ సృజన కొలిపాక క్రాంతి, మామూనూరి ప్రవీణ్ ఇతర నాయకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.