BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 11:01 pm Posted by : Reporter Srikanth

ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కుడికాల సురేష్ బాబు మాతృమూర్తి మృతికి బండి సంజయ్ నివాళి

ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కుడికాల సురేష్ బాబు మాతృమూర్తి మృతికి బండి సంజయ్ నివాళిభీమ్ ఇండియా టుడే న్యూస్ :- హుజూరాబాద్. పట్టణానికి చెందిన ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కుడికాల సురేష్ బాబు గారి మాతృమూర్తి మరణించిన విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వారి నివాసానికి వెళ్లి, అమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుడికాల సురేష్ బాబు గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పిస్తూ, భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, హుజూరాబాద్ పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని దివంగత ఆత్మకు ఘనంగా నివాళులర్పించారు.