ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ :- ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు ఉత్పన్నం కాలేదని, ఆఫ్లైన్లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు.ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసిన అనంతరం ముఖ్యమంత్రి గారు మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి వేదికలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో దేశస్థాయిలో ఒక...