హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్ట్, భీమ్ ఇండియా టుడే ప్రతినిధి శ్రీకాంత్ నూతన కారును కొనుగోలు చేసిన సందర్భంగా, ఈరోజు కారు షోరూంలో సీఐ శ్రీనివాస్ ప్రత్యేకంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్, శ్రీకాంత్కు పుష్ప మొక్కను అందజేసి అభినందనలు తెలియజేశారు. కొత్త వాహనం కొనుగోలు చేయడం ఆనందకర విషయమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపిన సీఐ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.
ఫోటో క్యాప్షన్:
నూతన కారును కొనుగోలు చేసిన జర్నలిస్ట్ శ్రీకాంత్కు కారు షోరూంలో సీఐ శ్రీనివాస్ పుష్ప మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.